Monday, April 29, 2024

ప్రతి ఇంటికెళ్లి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలి: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: జగనన్న సురక్ష తరహాలోనే ఆరోగ్య సురక్ష చేపట్టాలని అధికారులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు అధికారులతో జరిగిన సమీక్షలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ రూపొందించిన బ్రోచర్ ను  సిఎం వైయస్‌ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. సురక్ష తరహాలోనే ప్రతి ఇంటికెళ్లి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలని, ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని, సమస్యలను బట్టి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని సూచించారు. పరీక్షలు చేయడంతో పాటు మందులు, కళ్లద్దాలు ఇవ్వాలని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాలని పేర్కొన్నారు. ప్రతి మండలంలో నెలకు నాలుగు గ్రామాల్లో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలని, రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చెప్పారు.

Also Read: చంద్రబాబు జీవితమంతా రక్తసిక్తమే: భూమన

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సిఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ జి సాయి ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ ఎం జానకి, సిసిఎల్‌ఎ కార్యదర్శి ఏ ఎండి ఇంతియాజ్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, ఆరోగ్యశ్రీ సిఇఒ హరీందిర ప్రసాద్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ వెంకట మురళీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ పి కోటేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News