రెపో రేటు 5.15% కొనసాగింపు, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
2020-21లో జిడిపి 6%గా అంచనా, ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు వెల్లడి
ముంబై: ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఈసారి కూడా రెపో రేటును మార్చలేదు. ప్రస్తుత వడ్డీ రేటు 5.15 శాతంనే కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, భవిష్యత్తు లో అనిశ్చితి దృష్ట్యా ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీలోని మొత్తం ఆరుగురు సభ్యులు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఓటు వేశారు. ఆర్బిఐ గవర్నర్ శక్తికాం త దాస్ అధ్యక్షతన మూడు రోజుల సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆర్బిఐ గురువారం ఈ నిర్ణయాలు ప్రకటించింది. రెపో రేటు కాకుండా ఇతర రేట్లు కూడా యథాతథంగానే ఉన్నాయి.
రివర్స్ రెపో రేటు 4.90శాతం వద్ద ఉంది. డిసెంబ ర్ సమావేశంలో కూడా ఆర్బిఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదు. అంతకుముందు వరుసగా 5 కోతల తర్వాత రెపో రేటు 1.35 శాతం తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2020-21) 6శాతం జిడిపి వృద్ధి రేటు అంచనాను ఆర్బిఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019-20) 5శాతం వృద్ధిని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం లో రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 0.30 శాతం పెరిగాయి. ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తే పాలు, పప్పుధాన్యాల వంటి వస్తువుల రేట్లు పెరగవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బిఐ ద్రవ్యోల్బణ రేటు అంచనాను పెంచింది.
అయితే ఇది డిసెంబర్ గరిష్ట స్థాయికి (7.35 శాతం) పడిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుత త్రైమాసికంలో కొత్త పంట రావడం వల్ల ఉల్లి ధరలు తగ్గుతాయని ఆర్బిఐ తెలిపింది. విధానాలను రూపొందించేటప్పుడు ఆర్బిఐ రిటైల్ ద్రవ్యోల్బ ణ రేటును పరిగణనలోకి తీసుకుంటుంది. మధ్యకాలికంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద ఉంచాలని ఆర్బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2 శాతం తగ్గుతుంది లేదా పెరుగుతుంది. అయితే డిసెంబర్లో ఇది గరిష్ట పరిధి 6 శాతం పైకి చేరుకుంది. ఆర్బిఐ కూడా ఈసారి ద్రవ్య విధానానికి సర్దుబాటు దృక్పథాన్ని కొనసాగించింది. అంటే రెపో రేటులో మరింత తగ్గింపు సాధ్యమే.
జిడిపిపై అంచనాలు
2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జిడిపి వృద్ధి 6% ఉంటుందని బ్యాంక్ అంచనా వేసింది. అదే సమయంలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో వృద్ధిరేటు 5.5 శాతం నుండి 6 శాతం వరకు ఉంటుందని అంచనా. కాగా మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలను 6.5 శాతానికి రిజ ర్వ్ బ్యాంక్ పెంచింది. ఆహార ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, సేవల ఖర్చు వంటి అనేక అంశాలు రాబోయే కాలం లో ప్రభావితమవుతాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ప్రధాన వడ్డీ రేటును పెంచడంతో పాటు ఆర్థిక వృద్ధి వేగాన్ని పెంచడానికి ఇంకా అనేక చర్యలు ఉన్నాయి. ద్రవ్యోల్బణ దృక్పథం చాలా అనిశ్చితంగా ఉందని ఆయన అన్నారు. కాగా జిడిపి వృద్ధి తగ్గినప్పుడు ఆర్బిఐ కీలక వడ్డీ రేటు రెపో రేటును తగ్గిస్తుందని భావిస్తున్నారు. రుణాలు చౌకగా ఉంటే డిమాండ్ పెరుగుతుం ది. ఆర్థిక వృద్ధి రేటు వేగవంతం అవుతుంది. ఆర్బిఐ కూడా గత ఏడాది వరుసగా ఐదుసార్లు రెపో రేటును తగ్గించింది. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం దృష్ట్యా రెపో రేటును వరుసగా రెండోసారి స్థిరంగా ఉంచింది. వడ్డీ రేట్లు కాకుండా ఆర్థిక వృద్ధిని పెంచడానికి ఇతర మార్గాలు ఉన్నాయని ఆర్బిఐ గవర్నర్ అన్నారు.
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పునరుద్దరించాలి
వడ్డీ రేట్లను రెపో రేటు వంటి బాహ్య బెంచ్మార్క్లతో అనుసంధానించడం ద్వారా ప్రజలు ద్రవ్య విధానం నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారని దాస్ చెప్పారు. చిన్న పొదుపు పథకాల వడ్డీరేట్లను పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు.
కరోనావైరస్ను ఎదుర్కోవటానికి ప్రణాళిక
కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆకస్మిక ప్రణాళికను రూపొందించాలని ఆర్బిఐ గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. వైరస్ వ్యాప్తి కారణంగా పర్యాటకులు, అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితమవుతాయి. ఇది జనవరి చివరలో స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు, ముడి చమురు ధరలు తగ్గడానికి దారితీసింది.
ఇప్పుడు చెక్ క్లియరింగ్లో సమస్య ఉండదు
చెక్ క్లియరింగ్ సులభం చేయనున్నట్టు ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో పేర్కొంది. బ్యాంకు వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన సురక్షితమైన చెక్ వ్యవస్థను ప్రవేశపెడతామని ఆర్బిఐ ప్రకటించింది. దేశవ్యాప్తంగా చెక్ ట్రన్కేషన్ సిస్టమ్(సిటిఎస్)ను అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో సిటిఎస్కు ఎంతో ప్రయోజనం చేకూరిందని ఆర్బిఐ తెలిపింది. ఇప్పటివరకు ప్రధాన క్లియరింగ్ హౌజ్లకు మాత్రమే సిటిఎస్ ఉంది. సిటిఎస్తో చెక్ ఉపయోగిస్తే పని త్వరగా జరుగుతుంది. ఇది సురక్షితమైన ఆర్థిక లావాదేవీల ప్రక్రియ. చెక్ క్లియర్ కావడానికి ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంకుకు వెళ్ళనవసరం లేదు. ఈ వ్యవస్థలో చెక్ ఎలక్ట్రానిక్ చిత్రం, ఎంఆసిఆర్ బ్యాండ్ మొదలైన ఇతర ముఖ్యమైన సమాచారం కూడా పంపుతారు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది.
ఆర్థిక వృద్ధిని పెంచడానికి 3 నిర్ణయాలు
బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో 4 శాతం ఆర్బిఐ వద్ద ఉంచాలి. దీనిని క్యాష్ రిజర్వ్ రేషియో (సిఆర్ఆర్) అంటారు. చిన్న-మధ్యతరహా పరిశ్రమలు, ఆటో, గృహ రుణ విభాగాలలో బ్యాంకులు రుణ మొత్తాన్ని పెంచుకుంటే, వారు సేకరించిన మొత్తాన్ని తగ్గించడం ద్వారా సిఆర్ఆర్ను లెక్కించవచ్చని ఆర్బిఐ తెలిపింది. ఈ మినహాయింపు 2020 జూలై 31వరకు ఉంటుంది.
చిన్న-మధ్య తరహా పరిశ్రమల రుణ పునర్నిర్మాణ పథకానికి గడువు 9 నెలల పొడిగించారు. ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు చిన్న, మధ్యతరహా వ్యాపారాల రుణాలను ఒకేసారి పునర్నిర్మించే కాలపరిమితిని మార్చి 2020 నుంచి 2020 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ఆర్బిఐ రియల్ ఎస్టేట్ రంగానికి ఉపశమనం అందించింది. వాణిజ్య రియాలిటీ రుణాలతో ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఆలస్యం కావడానికి కారణాలు సమర్థిస్తే ఆ రుణాలకు తగ్గింపు ఉండదు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల కోసం సవరించిన నిబంధనల ముసాయిదా ఫిబ్రవరి 29 లోగా విడుదల అవుతుంది.
ఆర్బిఐ ముఖ్యాంశాలు
రెపో రేటు 5.15 శాతం వద్ద యథాతథం
202122 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి రేటు అంచనా 6 శాతం
కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు పెరగవచ్చు
పునరుద్ధరణ వృద్ధి కొనసాగించేందుకు సర్దుబాటు దృక్పథం, స్వల్పకాలికంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది
రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను జనవరిమార్చి త్రైమాసికానికి 6.5 శాతానికి పెంచుతూ సవరణ
పర్యాటకుల తాకిడి, అంతర్జాతీయ వాణిజ్యంపై కరోనా వైరస్ ప్రభావం
దేశీయ డిమాండ్కు దోహదం చేసేలా 202021 బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో హేతుబద్ధీకరణ
చిన్న పొదుపు పథాలపై వడ్డీ రేట్లలో మార్పులు అవసరం
మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకుల్లో రుణాల వడ్డీ రేట్లకు బాహ్య బెంచ్మార్క్ను ఏప్రిల్ 1 నుంచి అనుసంధానించనున్నారు.
జిఎస్టి నమోదు పొందిన ఎంఎస్ఎంఇ రుణాల పునరుద్ధరణకు గడువు 2020 మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు పొడిగింపు
గృహ పుణ సంస్థల సవరించిన నిబంధనలు జారీ
2020 జులై నుంచి ఆర్బిఐ తరచుగా డిజిటల్ పేమెంట్ ఇండెక్స్(డిపిఐ)ను పబ్లిష్ చేస్తుంది.
డిజిటల్ పేమెంట్లకు ఎస్ఆర్ఒ(స్వయం నియంత్రణ సంస్థ)కు నియమావళిని జారీ చేయనున్నారు
దేశవ్యాప్తంగా చెక్ ట్రన్కేషన్ సిస్టమ్(సిటిఎస్)ను సెప్టెంబర్ నాటికి తీసుకురానున్నారు
చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు
విదేశీ మారక నిల్వల 2020 ఫిబ్రవరి 4నాటికి 471.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి
2019 ఏప్రిల్నవంబర్ కాలంలో నికర ఎఫ్డిఐ 24.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి
2020 ఫిబ్రవరి 4 నాటికి నికర ఎఫ్పిఐ(విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు) 8.6 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో ఇది 14.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
Interest rates not the only way to revive growth