Sunday, May 12, 2024

కోహ్లి సేనకు ఐదో గెలుపు

- Advertisement -
- Advertisement -

IPL 2020: RCB Win by 82 Runs against KKR

షార్జా: ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో విరాట్ సేనకు ఇది ఐదో విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించాడు. డివిలియర్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చెలరేగి ఆడిన డివిలియర్స్ 33 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మరో ఆరు భారీ సిక్సర్లతో అజేయంగా 73 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఫించ్ (47), పడిక్కల్ (32) శుభారంభం అందించారు. కెప్టెన్ కోహ్లి 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది.

IPL 2020: RCB Win by 82 Runs against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News