Monday, April 29, 2024

చెన్నై ఘన విజయం

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయం సాధించింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 27 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో సిఎస్‌కె ప్లేఆఫ్‌కు మరింత చేరువైంది. మరోవైపు ఈ పరాజయంతో ఢిల్లీ ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. శివమ్ దూబే (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత లక్షఛేదనకు దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. రొసొ (35), మనీష్ పాండే (27) మాత్రమే కాస్త రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. సిఎస్‌కె బౌలర్లలో పతిరణ మూడు, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News