Sunday, April 28, 2024

కవితకు ఈడి నోటీసుల జారీ… బిజెపి కొత్త డ్రామా

- Advertisement -
- Advertisement -

టిపిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి మరోసారి నోటీసుల జారీ చేయడంపై బిజెపి కొత్త డ్రామాకు తెరలేపిందని టిపిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కవితకు నోటీసులు అంశానికి సంబంధించి విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ లబ్ధి పొందేందుకే ఈడి సమన్‌ల నాటకానికి తెరలేపారన్నారు.

ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని కానీ, కీలకంగా ఉన్న కవితను మాత్రం అరెస్ట్ చేయకుండా కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. తీరా లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం మరోసారి నోటీసుల పేరుతో డ్రామా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కవితపై బిజెపి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలకు అవగాహన ఉందని, గడిచిన తొమ్మిదినరేళ్లుగా బిఆర్‌ఎస్, బిజెపిల మధ్య ఉన్న అవగాహన తెలంగాణ ప్రజలకు అర్ధమైందన్నారు. ఈ రెండు పార్టీల నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన ధ్వజమెత్తారు.

K Kavitha

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News