Sunday, May 5, 2024

ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

pawan

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో ఆర్కేపురంలోని కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు. అమర సైనిక కుటుంబాల సంక్షేమం కోసం రూ. కోటి విరాళాన్ని బోర్డుకు జనసేనాని అందజేయనున్నారు. ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే’ సందర్భంగా పవన్‌ రూ.కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విజ్ఞాన భవన్ లో జరగనున్న స్టూడెంట్ పార్లమెట్ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సమాధానమిస్తారు. ఇందులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేఘాలయ శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో, కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. పవన్ సాయంత్రం డిల్లీ నుంచి అమరావతికి చేరుకుంటారు.

JanaSena Chief Pawan Kalyan arrives in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News