Monday, April 29, 2024

జనగామ నుంచి పల్లా…. ఘన్ పూర్ నుంచి కడియం?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం ఆరు నియోజకవర్గాల్లో సిట్టింగులు మార్పు చేసినట్టు బిఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. జనగామ నియోజకవర్గం  నుంచి ఎంఎల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. స్థానిక ఎంఎల్ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూకుంభకోణం పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆయనను తప్పించినట్టు సమాచారం. స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గం నుంచి తాటికొండ రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వనున్నట్టు సమాచారం. స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ రాజయ్యపై వ్యతిరేకత ఉండడంతో ఆయనకు బిఆర్ఎస్ పార్టీ మొండిచేయి చూపించింది. ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి కోవా లక్ష్మి, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి జాన్సన్ నాయక్, ముదోల్ నియోజకవర్గం నుంచి విఠల్ రెడ్డి, బోథ్ నియోజకవర్గం నుంచి అనిల్ జాదవ్ సీట్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు బిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

Also Read:  కరిచిన పాము… 1300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News