Saturday, April 27, 2024

మాజీ డిప్యూటీ సిఎంకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

kadiyam srihari tests positive for covid-19

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలంగాణ మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కడియంతో పాటు ఆయన డ్రైవర్, పి.ఎ, గన్ మెన్ లకూ కరోనా సోకినట్టు సమాచారం. కడియం హోంక్వారెంటైన్ లో ఉండగా… ఆయన సిబ్బందిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు హోమ్ క్వారెంటైన్ లోనే ఉంటున్నారు. రాష్ట్రంలో 47,705 మందికి కరోనా వైరస్ సోకగా… 429 మంది చనిపోయారు. 36,385 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా… ప్రస్తుతం 10,891 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

kadiyam srihari tests positive for covid-19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News