Monday, May 6, 2024

కొత్త సచివాలయం డిజైన్‌లలో మార్పులు..

- Advertisement -
- Advertisement -

కొత్త సచివాలయం డిజైన్‌లలో చిన్న చిన్న మార్పులు
తుదిమెరుగులు దిద్దిన సిఎం కెసిఆర్
వచ్చే దసరా నాటికి నూతన సెక్రటేరియట్ పూర్తి

TS new secretariat area increases by 33000 square feets

మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త సచివాలయం డిజైన్‌లలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. డిజైన్‌లలో అంతర్గతంగా, వెలుపల పలు మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో తుది డిజైన్‌లను ఖరారు చేసినా సిఎం కెసిఆర్ పలు మార్పులను సూచించినట్టుగా తెలిసింది. పలు మార్పులపై సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులతో చర్చలు జరిపారు. కొన్ని మార్పులు సూచించి తుది మెరుగులు దిద్దారు. కొత్తగా ప్రభుత్వం ఆమోదించిన డిజైన్‌లో భవనం ముందు స్థలంలో హెలీప్యాడ్, రెండు వైపులా లాన్లు, వాహనాల పార్కింగ్ స్థలంలో చిన్న పాటి మార్పులను చేసినట్టుగా తెలిసింది.
మార్పులపై నిర్మాణ సంస్థకు ఆదేశాలు
కొద్ది నెలల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త సచివాలయ ఫైనల్ డిజైన్‌తో పాటు సచివాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. మరోవైపు సచివాలయం కూల్చివేత, నిర్మాణం విషయంలో హైకోర్టులో దాఖలైన కొన్ని కేసులు తొలగిపోయాయి. కొత్త భవన నిర్మాణానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జూలై 7న కూల్చివేత పనులను ప్రారంభించి, కొద్ది రోజుల్లోనే పాత సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేలమట్టం చేసింది. శిథిలాల తరలింపు కూడా పూర్తయ్యింది. కొత్త సచివాలయ నిర్మాణానికి టెండర్లు సైతం ఫైనల్ అయ్యాయి. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి కొత్త సచివాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కోర్టులో కేసులు అన్ని తొలగిపోవడంతో భవన నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పనులు ప్రారంభమైన నేపథ్యంలో భవన నిర్మాణం, ఖాళీ స్థలంలో చిన్నపాటి మార్పులు చేస్తూ నిర్మాణ సంస్థకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News