- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ః శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నగదు లెక్కించే యంత్రంలోని కడ్డీల్లో అక్రమంగా తరలిస్తున్న 373 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తి నుంచి శంషాబాద్వి మానాశ్రయంలో 373 గ్రాముల బంగారాన్ని సీజ్చేసి కేసు నమోదు చేశారు. డబ్బులు లెక్కించే రెండు మిషన్లలోని కడ్డీల్లో దాచి బంగారం తరలింపుకు నిందితుడు యత్నించాడు. ఈ బంగారం విలువ దాదాపు రూ.19లక్షల 14 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. బంగారం తరలిస్తూ పట్టుబడిన వ్యక్తి గతంలో బంగారం తరలింపు కేసులలో నిందితుగా ఉన్నాడా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు.
373 Grams Gold Seized in Shamshabad Airport
- Advertisement -