Saturday, April 27, 2024

కెకెఆర్ ఘన విజయం….

- Advertisement -
- Advertisement -

 

షార్జా: ఐపిఎల్ 14లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 1.4 ఓవర్లు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో కెకెఆర్ జట్టు విజయ దుదుంభి మోగించింది.  18.2 ఓవర్లలో ఆరు  వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. కెకెఆర్ జట్టులో నితీష్ రాణా(36), శుభ్‌మన్ గిల్ (30) అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్లు సునీల్ నరైన్(21), వెంకటేష్ అయ్యర్ (14), దినేష్ కార్తీక్(12), రాహుల్ త్రిపాఠి(09), ఇయాన్ మోర్గాన్ (0) పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఎన్ రిచ్ నోర్ట్జ్, రవిచంద్రన్ అశ్విన్, లలిత్ యాదవ్, రబడా తలో ఒక వికెట్ తీయగా అవీష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News