Friday, May 17, 2024

ఈసారి అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టే: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: జిల్లాలో పలువురు బిజెపి, బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. బిజెపి, బిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో చాలా మందికి రైతుబంధు అందలేదని అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం, రైతులకు ఎనిమిదన్నర గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోందని పేర్కొన్నారు. వారం రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖారారు అవుతారని, తెలంగాణలో ఈసారి అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీనేనని వెంకట్ రెడ్డి జోస్యం చేప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫి చేస్తామని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News