ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదిపురుష్’ షూటింగ్ పునః ప్రారంభానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లో సుదీర్ఘ షెడ్యూల్ కోసం ఏర్పా ట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాలో సీత పాత్రలో ప్రభాస్కు జోడీగా నటిస్తున్న హీరోయిన్ కృతి సనన్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో కృతిసనన్ పాత్ర గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాని ప్రకారం ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందట. ముఖ్యంగా ఆమె పాత్రను పరిచయం చేసే క్రమం చాలా విభిన్నంగా ఉంటుందట. హీరో రేంజ్ లో పాత్రను హైలైట్ చేసి చూపి ంచబోతున్నట్లుగా తెలిసింది. కృతి సనన్ పాత్ర విభిన్నం గా ఉండటంతో పాటు అందరినీ ఆకట్టుకుంటుందట. ప్రభాస్ ఈ సినిమాలో రాముడిగా కనిపించబోతుండగా.. లంకేషుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్లో ప్రత్యేక సెట్టింగ్ను నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్లో యూనిట్ సభ్యులు అంతా కూడా పాల్గొనబోతున్నారు.
సీత పాత్ర హైలైట్గా…
- Advertisement -
- Advertisement -
- Advertisement -