Saturday, May 11, 2024

మంత్రి కెటిఆర్ ఔదార్యం

- Advertisement -
- Advertisement -

KTR help to Road mishap victims

 

సిద్దిపేట : మంత్రి కెటిఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన కాన్వాయ్ లో ఆసుపత్రికి పంపించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఫోన్ లో కోరారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట ఔటర్ బైపాస్ పైన, మెడికల్ కాలేజీ దగ్గరలో బైక్ ఆక్సిడెంట్ జరిగింది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ ని ఢీకొట్టి కిందపడ్డారు. వీరు సిద్దిపేట కాళ్ళకుంట కాలనీకి చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులుగా తెలిసింది. అదే సమయంలో అటువైపు నుండి వెళ్తున్న మంత్రి కెటిఆర్ కాన్వాయ్… ప్రమాదాన్ని చూసి, వెంటనే ఆగి, కారు దిగి, తన కాన్వాయ్ లోని 2 కార్లల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తన పిఎ మహేందర్ రెడ్డిని, ఎస్కార్ట్ పోలీస్ లను ఇచ్చి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ లో సూచించారు మంత్రి కెటిఆర్. ఆపదలో స్పందించిన కెటిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు అక్కడే ఉన్న వాహన చోదకులు, మరియు క్షతగాత్రుల బంధువులు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News