Wednesday, May 8, 2024

డబుల్ బొనాంజ

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

డిసెంబర్‌లో జిహెచ్‌ఎంసి పరిధిలో 85వేల ఇళ్ల పంపిణీ
త్వరలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, ఒకటి రెండు రోజుల్లో తుది మార్గదర్శకాలు
ప్రతి నియోజక వర్గానికి 4వేల చొప్పున డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం
రూ.9,700కోట్ల వ్యయంతో నిర్మాణాలు : సమీక్షా సమావేశంలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మిస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. పేదల ఆత్మగౌరవంతో జీవించాలన్న ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని చేపట్టారన్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు రూ, 9,700 కోట్లతో ఇళ్ళ నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. ఈ డిసెంబర్ మాసాంతానికి జిహెచ్‌ఎంసి పరిధిలో 85వేల ఇళ్ళను లబ్ధిదారులకు అందించను న్నామన్నారు. ఇందుకోసం త్వరలోనే గృహ నిర్మాణ శాఖ అధికారులతో చర్చించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామ న్నారు. దీనికి సంబంధించిన తుది మార్గదర్శకాలను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంపైన బుధవారం మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లతోపాటు జిహెచ్‌ఎంసి హౌసింగ్ విభాగం అధికారులు, పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇళ్ళ నిర్మాణ పనులను ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలను శరవేగంగా పూర్తి చేయాలన్నారు. పూర్తి అయిన ఇళ్ళను పేదలకు వాటిని అందించే కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఆగస్టు మాసాంతం నుంచి డిసెంబర్ నెల వరకు పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, వెంటనే ప్రజలకు పంపిణి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు మరో పది వేలు జె ఎన్‌ఎన్ యు ఆర్ ఎం మరియు వాంబే ఇళ్లు పంపిణికి సిద్ధంగా ఉన్నట్లుగా అధికారులు వివరించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున 24 నియోజకవర్గాలకు లక్ష ఇళ్లు అందించే కార్యక్రమం ఉండబోతుందన్నారు.

దీనికి సంబంధించిన లబ్దిదారుల క్యాచ్‌మెంట్ ఏరియా కూడా రూపొందించినట్లు మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాల ఇచ్చినటువంటి మురికివాడల్లోని ప్రజల(ఇన్‌సిట్యూ)లబ్ధిదారుల జాబితాను వెంటనే అప్లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. జిహెచ్‌ఎంసి పరిసర జిల్లాలో నిర్మిస్తున్న ప్రాంతాల్లో సుమారు 10శాతం స్థానిక ప్రజల కోసం కేటాయించిన నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచి ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు కెటిఆర్ సూచించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతు న్నాయని, ఇందులో సింహభాగాన్ని ఈ సంవత్సరాంతానికి ప్రజలకు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహాన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

KTR Review on double bedroom houses in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News