Sunday, April 28, 2024

ఏం తప్పు చేశారని కెసిఆర్ ను ఇంటికి పంపించాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి రాకముందే రైతుబంధును ఆపిందని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ కు 11సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు.. ఏం తప్పు చేశారని కేసీఆర్ ను ఇంటికి పంపించాలని ప్రశ్నించారు.

కేసీఆర్ మూడోసారి గెలిస్తే.. కొత్త పతకాలు తీసుకొస్తామని చెప్పారు. ధరణిని రద్దు చేసి పట్వారీ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. ధరణి రద్దైతే దళారుల రాజ్యం వస్తోందన్నారు. బీఆర్ఎస్ పై గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News