- Advertisement -
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఐటి కారిడార్ లో చిరుత సంచారం కలకలం రేపింది. బయోడైవర్సిటీ చౌరస్తాలోని రొడా మెస్ట్రీ కాలేజీలో చిరుత కుక్కను ఎత్తుకెళ్లింది. కుక్కను వేటాడి ఎత్తుకెళ్లిన సంఘటనను చూసిన కాలేజీ సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత కాలేజీ పక్కన గుట్టల్లోకి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. చిరుత జాడ కోసం అధికారులు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాలేజీ భవనంపై రక్తపు మరకలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికంగా ఉండే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -