Saturday, April 27, 2024

ఆనందయ్యకు ఎంఎల్‌సి పదవి ఇవ్వండి: ఎపి గవర్నర్‌కు వినతి

- Advertisement -
- Advertisement -

 

Letter to AP Governor for Anandayya MLC Post

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఎంఎల్‌సి పదవి ఇవ్వాలంటూ వెన్నెల ఫౌండేషన్ అనే సంస్థ ఎపి గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. కరోనా రోగులకు ఆయుర్వేద వైద్యంతో చికిత్స చేస్తోన్న ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎంఎల్‌సి పదవి ఇవ్వాలని ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కోరింది. ఈక్రమంలో ఆనందయ్యకు ఎంఎల్‌సి పదవి ఇవ్వాలని వెన్నెల ఫౌండేషన్ వినతిని పరిశీలించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసింది. కాగా, గవర్నర్ ఆదేశాల మేరకు గవర్నర్ సెక్రటరీ ఆనందయ్య ఎంఎల్‌సిపై సిఎస్‌కు లేఖ రాశారు. ఎపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలని పలువురు పేర్కొంటున్నారు.

Letter to AP Governor for Anandayya MLC Post

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News