Monday, April 29, 2024

ఎంఎల్‌ఎలయింది చొక్కా విప్పి షో చేయడానికా?: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిసిలను నమ్మించి సిఎం జగన్ మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని టిడిపి నేత లోకేష్ దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా కుప్పగల్‌లో బిసి ప్రతినిధులతో టిడిపి నేత లోకేష్ ముఖాముఖి మాట్లాడారు. బిసిలను ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహించింది టిడిపినేనని పేర్కొన్నారు. జగన్ తన పాలనలో బిసిలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని, వైసిపి నేతలు ఎంఎల్‌ఎలయింది చొక్కా విప్పి షో చేయడానికా? అని ప్రశ్నించారు. దళితుల పట్ల మంత్రి ఆదామూలపు సురేష్‌కు చిత్తశుద్ధి ఉంటే దళితులపై వైసిపి దమనకాండను ఎందుకు ప్రశ్నించలేదని చురకలంటించారు. చంచల్‌గూడ జైలుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Also Read: చంపిన వ్యక్తి కలలోకి వచ్చి కలవరపెడుతున్నాడని…. పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News