Monday, April 29, 2024

కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

Maro prasthanam movie release sept 24

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మరో ప్రస్థానం’. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయికగా నటించిన ఈ చిత్రంలో భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం’ మూవీ ఈ నెల 24న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చేలా ‘మరో ప్రస్థానం’ ఉంటుందని అన్నారు. చిత్ర దర్శకుడు జాని మాట్లాడుతూ ఇది ఒక డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా అని పేర్కొన్నారు. హీరో తనీష్ మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ ఘటనలు, బర్నింగ్ ఇష్యూస్ చూపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కబీర్ దుహాన్ సింగ్, ముస్కాన్ సేథీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News