Saturday, April 27, 2024

మెదక్‌లో ప్రేమజంట చెరువులో దూకి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నార్సింగి: మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత కొన్ని సంవత్సరాల నుంచి ఖలీల్, కల్పన ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మతాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లికి కల్పన కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రెండు నెలల క్రితం కల్పనను మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో కల్పన్, ఖలీల్ నాలుగు రోజుల క్రితం పారిపోయారు. ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి చెరువులో రెండు మృతదేహాలు తేలడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News