Monday, April 29, 2024

చెట్టు లెక్కగలను.. కల్లు తీయగలను:మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో మూడేళ్ల క్రితం తాను పంపిణీ చేసిన గిరక తాడు కల్లు పారుతున్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి, ఆ కల్లును తాగారు. మూడేళ్ల క్రితం తన సొంత ఖర్చులతో నియోజకవర్గవ్యాప్తంగా అనేక గిరకతాటి చెట్లను గౌడ సోదరులకు మంత్రి పంపిణీ చేశారు. అప్పుడప్పుడు ఆయా పర్యటనల్లో ఆ గిరిక తాళ్లు ఎలా ఉన్నాయి? ఏపుగా పెరిగాయా?! కల్లు (నీరా) వస్తుందా? అంటూ ఆరా తీస్తూ ఉంటారు.

గురువారం పాలకుర్తి నియోజకవర్గంలో పలు పరామర్శలు చేస్తూ పెళ్లిళ్లకు హాజరవుతూ మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో తాను పంపిణీ చేసిన గిరక తాడు కి నేడు కల్లు పారుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి… ఆ గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి, ఆ కల్లును సేవించారు. గిరిక తాటి కల్లు కు ఔషధ గుణాలు ఉన్నాయని, సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని అన్నారు. గిరక తాటి చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News