- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. బంజాాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగల్ రావు పార్క్ సమీపంలో మంత్రి కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. బైక్ను తప్పించబోయి మంత్రి కాన్వాయ్లోని మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మంత్రి పువ్వాడ అజయ్ కి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం అనంతరం ఆయన మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
Minister Puvvada Ajay Kumar Convoy met Accident
- Advertisement -