ఛండీగఢ్: భూవివాదంలో పదేళ్ల కుర్రాడు తన మేనత్త, నానమ్మను తుపాకీతో కాల్చాడు. దీంతో మేనత్త తలలో బుల్లెట్ దిగినా… ఆమె ఏడు కిలోమీటర్లు కారులో ప్రయాణించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుఖ్భేందర్ అనే మహిళకు కూతురు సుమీత్ కౌర్, కుమారుడు హరిందర్ సింగ్ ఉన్నాడు. సఖ్భేందర్ భర్త చనిపోవడంతో ఆమె 16 ఎకరాల ఆస్తిని తన కూతురు, తనపై రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆ భూమి విషయంలో కుమారుడు, కూతురు, తల్లి మధ్య వివాదం జరుగుతోంది. భూమి విషయంలో గొడవలు జరుగుతుండడంతో హరిందర్ సింగ్ కుమారుడు (16) ఆగ్రహానికి లోనై తన అత్త, నానమ్మను తుపాకీలో కాల్చాడు. అత్త తలలో బుల్లెట్ దిగడంతో ఆమె ఏడు కిలో మీటర్లు ప్రయాణించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు సుఖ్భేందర్, సుమిత్ కౌర్ స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అత్త తల నుంచి బుల్లెట్ను వైద్యులు తొలగించారు. అత్త పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరిందర్ సింగ్, అతడి కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ను జువైనల్ హోమ్కు తరలించారు. ఈ సంఘటన పంజాబ్లోని ముక్త్సార్ జిల్లాలో జరిగింది.
Minor Nephew Shot on women, Grand Mother in Punjab,three gunshot wounds in her head and one on the face, a 42-year-old woman drove 7 kilometres to a police station in Punjab