Monday, April 29, 2024

తప్పిపోయిన కానిస్టేబుల్‌ను నక్సలైట్లే హతమార్చారు: చత్తీస్‌గఢ్ ఐజి

- Advertisement -
- Advertisement -

Missing constable killed by Naxalites: Chhattisgarh IG

 

రాయ్‌పూర్: ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆచూకీ లేకుండా పోయిన కానిస్టేబుల్‌ను తామే చంపేశామని సిపిఐ(మావోయిస్ట్) పార్టీ ఓ ప్రకటనలో తెలిపిందని చత్తీస్‌గఢ్(బస్తర్ రేంజ్) ఐజి పి.సుందర్‌రాజు వెల్లడించారు. అయితే, వారు హత్యగావించామని చెబుతున్న కానిస్టేబుల్ మనోజ్‌నేతమ్ మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అందజేయలేదని ఐజి తెలిపారు. నక్సలైట్లు గతంలో ఎవరిని హత్యగావించినా శవాన్ని రోడ్డు పక్కన లేదా అడవుల్లో వదిలేసేవారని, ఈసారి అలా జరగలేదని ఐజి పేర్కొన్నారు. కాంకేర్ జిల్లా కోడేకుర్సే పోలీస్ స్టేషన్‌లో పని చేసే నేతమ్ ఏప్రిల్ 28నుంచి కనిపించకుండా పోయారని ఐజి తెలిపారు. రెండు రోజుల తర్వాత కోడేకుర్సేలోని బుర్కే గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన నేతమ్ మోటార్‌సైకిల్ లభించిందని ఆయన తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News