- Advertisement -
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు
హైదరాబాద్: బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్పై ఆవరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో బీహార్, జార్ఖండ్ వైపుగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, దీంతో రానున్న రెండురోజుల పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గాలిలో తేమ సాధారణం కంటే 15 శాతం వరకు తగ్గడంతో వాతావరణం పొడిగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Moderate rains across the state in the coming days
- Advertisement -