Friday, May 3, 2024

బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని

- Advertisement -
- Advertisement -

BJP meeting

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్‌ఎండిసి కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆరంభించారు. ఈ సమావేశంలో సంస్థాగత విషయాలను, ఐదు రాష్ట్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది. ఈ సమావేశానికి కొందరు నేరుగా హాజరవుతుండగా, మరికొందరు వర్చువల్‌గా పాల్గొంటున్నారు. ఈ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ప్రసంగించనున్నారు. ఈ సమావేశం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుందని బిజెపి రాజ్యసభ ఎంపి, మీడియా విభాగం అధినేత అనీల్ బలూనీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News