Monday, April 29, 2024

మరో రెండేళ్లు ధోనీనే కెప్టెన్!

- Advertisement -
- Advertisement -

చెన్నై: మరో రెండేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగే అవకాశాలు ఉన్నాయని సిఎస్‌కె చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాశీ విశ్వనాథన్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న రెండు సీజన్‌లకు కూడా ధోనీ సారథ్యం వహించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ధోనీ వయసు 40 దాటినా ఇబ్బందేమీ లేదన్నారు. వయసు పెరిగినా ధోనీ ఫిట్‌నెస్ మెరుగ్గానే ఉందన్నారు. దీన్ని కాపాడుకునేందుకు అతను ఎంతో కఠినంగా శ్రమిస్తున్నాడని ప్రశంసించారు. ధోనీ క్రికెట్‌లో కొనసాగినంత కాలం అతనే తమ జట్టుకు సారథిగా ఉంటాడని, దీనిలో వేరే ఆలోచనకు తావులేదని విశ్వనాథన్ స్పష్టం చేశారు. అతనికి ఫిట్‌నెస్ సమస్యలు కూడా ఏమీ లేవని దీంతో రానున్న రెండేళ్ల పాటు అతనే సారథిగా ఉండడం ఖాయమని జోస్యం చెప్పారు.

MS Dhoni to continue as CSK Captain for 2 more years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News