స్టార్ హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు హాలీడే ట్రిప్ అంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశం లేదా కొత్త ప్రదేశాలకు వెళ్తారు. హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ రెగ్యులర్గా అమెరికాకు హాలీడే టూర్కు వెళ్తూ ఉంటారు. అయితే గత ఏడు నెలలుగా వీళ్లు కరోనా కారణంగా దేశం దాటలేదు. చెన్నై, కేరళలోనే వీరు గడుపుతున్నారు. ఇప్పుడు వారు గోవాకు హాలీడే ట్రిప్ కోసం వెళ్లారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ ప్రేమ జంట హాలీడే ట్రిప్కు వెళ్లింది. గోవాలో వీరిద్దరు ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరి పెళ్లి గురించి మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తున్నా కూడా పెద్దగా స్పందించకుండా హాలీడే టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరు సహజీవనం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.
Nayanthara and Vignesh Shivan’s Goa Vacation