Tuesday, May 14, 2024

కారు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

- Advertisement -
- Advertisement -

New married couple died in Car Accident at West Godavari

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా  కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నవ దంపతులతోపాటు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందిన నవ దంపతులు వెంకటేష్, నవ్యగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టునున్నట్లు తెలిపారు.

New married couple died in Car Accident at West Godavari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News