Monday, April 29, 2024

ఐదో వికెట్ కోల్పోయిన కివీస్..

- Advertisement -
- Advertisement -

 

మౌంట్ మౌంగనూయి: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. టీమిండియా నిర్దేశించిన 297 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్(66), నికోలస్(80)లు అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు మొదటి వికెట్ కు సెంచరీ(106) భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ దశలో జోరు మీదున్న గుప్టిల్ తోపాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్(22), నిషమ్(19)ని ఔట్ చేసిన చాహల్ భారత్ కు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత నికోలస్ ను శార్దుల్ ఠాకూర్ పెవిలియన్ కు పంపించగా, టేలర్(12)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 40 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లాథమ్(14), గ్రాండ్ హోమ్(2)లు ఉన్నారు.

New Zealand lost 5th Wicket against India in 3rd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News