ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్గా ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఈ సినిమాలో మరో హీరోయిన్ నటించబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ తక్కువ సమయం కనిపించినా కూడా కథలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందట. కనుక ఆ పాత్రకు గాను ప్రముఖ హీరోయిన్ ను నటింపజేయాలని నాగ్ అశ్విన్ ప్రయత్నాలు చేస్తున్నాడు. నటిగానే కాకుండా తన అందంతో పలు చిత్రాల్లో మెప్పించిన ముద్దుగుమ్మ నివేదా థామస్ను ఎంపిక చేసే యోచనలో ఉన్నాడట. ఆమె తెలుగుతో పాటు తమిళంలో కూడా గుర్తింపు దక్కించుకుంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్తో అశ్వినీదత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పట్టాలెక్కించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.
Nivetha Thomas work with Prabhas in Nag Ashwin Film