- Advertisement -
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవంలందచేసిన 34 మంది సిబిఐ అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రకటించిన ఈ అవార్డులను నేడు ప్రదానం చేశారు. దేశంలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలని ఈ సందర్భంగా అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. ఆర్థిక ప్రపంచీకరణతో కొత్త రకం నేరాలు ముఖ్యంగా ఆర్థిక నేరాలు పెరిగిపోయాయని, వీటిని అంతర్జాతీయ సహకారంతో అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అవినీతిపై యుద్ధం సాగించడంలో అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థలు నిర్వహిస్తున్న ముఖ్యమైన పాత్రను ఆయన ప్రశంసించారు.
NSA presents President’s Police Medal to 34 CBI officers
- Advertisement -