Sunday, May 12, 2024

నిరాడంబరంగా ఓనం

- Advertisement -
- Advertisement -

కేరళ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

Onam festival celebrations in kerala

తిరువనంతపురం: కేరళ ప్రజలు ఓనం పండుగను ఈసారి నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇంటిముందు పూలతో ముగ్గులు వేసి, ఎవరి ఇంట్లో వారు ఈ పండుగను జరుపుకున్నారు. ఏటా ఈ పండుగ సందర్భంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు. సోమవారం ఓనం సందర్భంగా కేరళ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ అరీఫ్ మహ్మద్‌ఖాన్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News