Friday, April 26, 2024

లారీని వెనక నుంచి ఢీకొట్టిన డిసిఎం… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in DCM collided to lorry

 

శంషాబాద్: లారీని వెనక నుంచి వచ్చి డిసిఎం ఢీకొట్టడంతో డ్రైవర్ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఔటర్ రింగ్ రోడ్డులోని అప్పా జంక్షన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్టీల్ లోడ్‌తో లారీ రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ నుంచి గచ్చిబౌలికి వెళ్తుండగా అప్పాజంక్షన్ సమీపంలో జడ్చర్ల నుంచి జహీరాబాద్‌కు కీరా లోడ్‌తో వెళ్తున్న డిసిఎం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలో డిసిఎం డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు గుమ్మడిదల మండలం లచ్చిరెడ్డిగూడ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News