- Advertisement -
సంగారెడ్డి : ఐడిఎ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం చిన్న ఖేతాన్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా..? ఇంకా ఏదైనా కారణంతో జరిగిందా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -