- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో 47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ మీడియాతో మాట్లాడారు. బత్తాయి పండ్లలను ఢిల్లీ, కోల్కతాలకు పంపాల్సి ఉందని, లాక్డౌన్ నేపథ్యంలో బత్తాయి పండ్లను పంపలేని పరిస్థితి నెలకొందన్నారు. మార్కెటింగ్ శాఖ బత్తాయిలను హోం డెలివరీ చేస్తోందన్నారు. తెలంగాణ ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 592కు చేరుకోగా 17 మంది మృత్యువాతపడ్డారు. భారత్ దేశంలో కరోనా వైరస్ 10,752 మందికి సోకగా 360 మంది చనిపోయారు. ప్రపంచంలో కరోనా రోగుల సంఖ్య 19,34,070కు చేరుకోగా 1,20,460 మంది మరణించారు.
Orange cultivation 47 thousand acres in Telangana
- Advertisement -