తొగుట: దుబ్బాక ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాతను ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం తుక్కాపూర్, ఎల్లారెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ కరెంట్ ఇయ్యక చంపితే.. బిజెపి మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. కెసిఆర్ 24 గంటల కరెంట్ ఇస్తూ రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సోలిపేట రామలింగారెడ్డిని గుర్తు చేసుకుంటూ కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. అనంతరం సోలిపేట సుజాత మాట్లాడుతూ.. కెసిఆర్ ఆశీర్వాదంతో రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని అన్నారు. దుబ్బాకను రామలింగారెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని.. మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి సునితా లకా్ష్మరెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితా లకా్ష్మరెడ్డి, వైస్ చైర్మన్ పోశయ్య,ఎంపిటిసి స్వామి, సర్పంచులు గోవర్దన్, నాయకులు కొండల్ రెడ్డి, లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Padma Devender Reddy Dubbaka Election Campaign