లాహోర్ : ఇంగ్లండ్లో పర్యటించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమ్మతించింది. సిరీస్లో భాగ ంగా పాకిస్థాన్ మూడు టెస్టులు, మరో మూడు ట్వంటీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక, తమ దేశంలో పర్యటించే పాకిస్థాన్ క్రికెటర్ల ఆరోగ్య బాధ్యతలను పూర్తిగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డే చూసుకుంటోంది. ఈ మేరకు ఈసిబి అధికాకులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇదు దేశాల క్రికెటర్లకు పూర్తిగా భద్రత ఉంటుందోదని, ఎలాంటి భయం లేకుండా సిరీస్లో పాల్గొనవచ్చని ఈసిబి సూచించింది.
కరోనా వల్ల ఇంగ్లండ్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. వేలాది మంది కరోనావల్ల మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే ఇంగ్లండ్లో మాములు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక, క్రికెట్కు పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ దేశంలో పర్యటించేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఒప్పించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే పాక్ జట్టు జులైలో ఇంగ్లండ్లో పర్యటనకు బయలుదేరుతుంది.
Pakistan agrees to tour England