- Advertisement -
హైదరాబాద్: భారత్-శ్రీలంక మధ్య నున్న పాల్క్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎంఎల్సి కవిత అభినందించారు. 30 మైళ్ల పాల్క్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండో మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించింది. ఎంఎల్సి కవిత తన రోల్ మోడల్ అని గోలి శ్యామల తెలిపింది. తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చారని పేర్కొన్నారు.
- Advertisement -