Monday, April 29, 2024

పన్నీర్ సెల్వం తమ్ముడు బాలమురుగన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Panneerselvam’s brother O Balamurugan dies

చెన్నై: అన్నాడిఎంకె నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తమ్ముడు ఓ బాలమురుగన్(55) అనారోగ్యంతో చనిపోయాడు. బాలమురుగన్ వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండు, మూడు శస్త్ర చికిత్సలు కూడా చేసినా ఆరోగ్య పరిస్థితులలో మార్పు రాకపోవడంతో కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. బాలమురుగన్‌కు భార్య లతా మహేశ్వరి, కూతురు ఉంది. బాలమురుగన్ మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి సంతాపం వ్యక్తం చేశారు. పన్నీరు సెల్వంతో  ముఖ్యమంత్రి, పళని స్వామి ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News