Monday, April 29, 2024

‘సర్కారు వారి పాట’తో అభిమానులకు ఫుల్ మీల్స్‌…

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూటింగ్ ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ప్రారంభమైంది. షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కీలక షెడ్యూల్‌ను ఆగస్టు వరకు పూర్తి చేస్తారట. సెప్టెంబర్ వరకు షూటింగ్‌ను పూర్తి చేయాలని దర్శకుడు పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల దర్శకుడు పరశురామ్ ‘సర్కారు వారి పాట’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా అభిమానమని… ఈ సినిమాను ఆయన అభిమానిగా చేస్తున్నట్లుగా చెప్పాడు. అభిమానులు మహేష్‌ను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలా తాను చూపించబోతున్నట్లుగా చెప్పిన దర్శకుడు సినిమాలోని కామెడీ కూడా సూపర్బ్‌గా ఉంటుందని అన్నాడు. మహేష్ బాబులోని కామెడీ యాంగిల్‌ను ఈ సినిమాలో విభిన్నంగా చూపించడంతో పాటు రెగ్యులర్‌కు భిన్నంగా కథనం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పాడు. కామెడీ సన్నివేశాలు, విజిల్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయని.. మహేష్ బాబు సగటు అభిమానికి ‘సర్కారు వారి పాట’ సినిమా ఫుల్ మీల్స్ అన్నట్లుగా ఉంటుందని పరశురామ్ పేర్కొన్నాడు. ఇక భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Parasuram Interesting comments on Sarkaru Vaari Paata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News