- Advertisement -
చెన్నైః తమిళనాడులో దారుణ సంఘటన జరిగింది. మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేషెంట్ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. సోమవారం తెల్లవారుజామున కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు ఆయుధాలతో ఆస్పత్రిలోకి ప్రేవేశించి ఓ పేషెంట్పై దాడి చేసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోని సిసి పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Patient murder in Madurai Rajaji Hospital in Tamil Nadu
- Advertisement -