Monday, April 29, 2024

ఎస్ఐ ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయని యువకుడు ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పందికోనలో యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్‌ఐ పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెందడంతో పురుగుల మందు తాగి ఆరువేటి రాజు ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే కుటుంబ సభ్యులు రాజును పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News