పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు.గురువారం ఉదయం మాదాపురం నుంచి మియాపూర్ వరకు పవన్ మెట్రోలో ప్రయాణించారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మియాపూర్లో జరుగుతోంది. దీంతో షూటింగ్లో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి మాదాపూర్ మెట్రో స్టేషన్కు చేరుకున్న పవన్ అక్కడి నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించిన వపన్ మధ్యలో అమీర్ మెట్రో స్టేషన్లో రైలు మారిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మెట్రోలో తన ప్రక్కన కూర్చున్న ఓ రైతుతో మాట్లాడిన పవన్ పంటల గురించి, కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పవన్ తోపాటు స్టార్ ప్రడ్యూసర్ దిల్ రాజ్ కూడా మెట్రోలో ప్రయాణించారు.
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు హైదరాబాద్ మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు.
వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. pic.twitter.com/3k5m6MEgzY— JanaSena Party (@JanaSenaParty) November 5, 2020
జనసేనాని మెట్రో ప్రయాణం pic.twitter.com/XCXakf9DfP
— JanaSena Party (@JanaSenaParty) November 5, 2020
Pawan Kalyan travelled in Metro Rail in Hyderabad