- Advertisement -
జామ్నగర్ రాజకుటుంబం బహుకరణ
న్యూఢిల్లీ: రాజ్పథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన ప్రత్యేక తలపాగా(పగిడి) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుజరాత్లోని జామ్నగర్ నుంచి ప్రత్యేకంగా ప్రధాని మోడీ కోసం ఈ తలపాగా వచ్చింది. జామ్నగర్ మాజీ రాజకుటుంబం ప్రధాని మోడీకి ఈ రాజ తలపాగాను బహుకరించింది. పసుపు రంగు చుక్కలు గల ఎర్రని తలపాగాతో కుర్తా పైజామా, బూడిదరంగు జాకెట్ వస్త్రధారణలో ప్రధాని మోడీ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. జామ్నగర్ ప్రాంత ఘన సంస్కృతిని ఈ సాంప్రదాయ రాజ తలపాగా ప్రతిబింబించిందని జామ్నగర్ ఎంపి పూనాపెబన్ మాదామ్ ట్వీట్ చేశారు. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం నాడు, గణతంత్ర దినోత్సవం నాడు జరిగే అధికారిక వేడుకలలో ప్రధాని ధరించే తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
- Advertisement -