Sunday, April 28, 2024

కాంగ్రెస్ ఔట్‌డేటెడ్ పనికిరాని ఫోన్: ప్రధాని

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఔట్‌డేటెడ్ పనికిరాని ఫోన్
దేశ ప్రజలు 2014లోనే మూలకు పడేశారు
సరికొత్త దశను ఎంచుకున్నారు
ఇండియా మొబైల్ సదస్సులో ప్రధాని
దేశం ఇక 6జి లీడర్ అని వెల్లడి
న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వచ్చి దేశం దశను మార్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు తెలిపారు. 2014 కేవలం తేదీలతో కూడిన సంవత్సరపు మైలురాయి కాదని, ఓ అధ్యాయ మార్పిడి కాలం అని పేర్కొన్నారు. 2014తో దేశం దశ దిశ మారిందని ఆయన ఇక్కడ శుక్రవారం జరిగిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ సభలో తెలిపారు.2014తో ప్రజలు పనిచేయని పనికిరాని ఔట్‌డేటెడ్ కాంగ్రెస్ ఫోన్‌ను వదుల్చుకున్నారని, సరికొత్త ఫోన్ల వంటి సర్కారును ఎంచుకున్నారని కాంగ్రెస్‌పై వ్యంగాస్త్రాలు సంధించారు.

2014ను తాను కేవలం క్యాలెండర్ మార్పిడి ప్రక్రియ అనుకోవడం లేదని, ఇది మహత్తర మార్పునకు దారితీసిన బద్లావ్ ఘట్టానికి ప్రతీక అన్నారు. మొబైల్ ఫోన్ల విషయంలో దేశం సాధించిన ప్రగతి విశ్లేషణకు ఈ సభ ఏర్పాటు అయింది. ఇంతకు ముందు మొబైల్ ఓ విలాసవంతమైన దిగుమతి సరుకుగా ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిందని, భారతదేశం ఇప్పుడు మొబైల్ ఫోన్ల తయారీలో అగ్రగామిగా మారిందని, ఇప్పుడు ఎగుమతిదారు అయిందన్నారు.

అతి పెద్ద టెక్ కంపెనీలు యాపిల్ మొదలుకుని గూగుల్ వరకూ భారతదేశంలో తమ ఉత్పత్తి సంస్థల ప్రారంభానికి ముందుకు వస్తున్నాయని వివరించారు.అత్యంత వేగంగా 5 జి మొబైల్ టెలిఫోన్ సేవలను విస్తరించుకుని వెళ్లిన తరువాత ఇప్పుడు 6జిలో భారత్ ప్రపంచానికి టాప్‌గా నిలుస్తుందని , ఇదంతా కూడా తమ ప్రభుత్వం ఈ రంగం ప్రగతికి తీసుకువచ్చిన పలు విధాలైన సాంకేతిక వెన్నుదన్నులతోనే సాధ్యం అయిందన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో దేశంలో 5 జి టెక్నాలజీని తీసుకువచ్చారు. ఏడాదిలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రాతిపదికన 5 లక్షల 5 జి స్టేషన్లు ఏర్పాటు అయ్యాయని వివరించారు.

యుపిఎ కాలంలో డొక్కు ఫోన్లు..ఇప్పుడు ఐ ఫోన్లు
యుపిఎ హయాంలో ఫోన్ల టెక్నాలజీ ప్రగతి కంటె ఎక్కువగా సంబంధిత కేటాయింపులలో అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. అప్పట్లో 2 జి టెలీకాం స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఎంత అవినీతి జరిగిందనేది అందరికి తెలిసిందేనని ప్రధాని తెలిపారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో 4జిగా విస్తరణ జరిగింది. ఎక్కడా అవినీతి మరకలు లేవని తెలిపిన ప్రధాని ఇక 6 జి టెక్నాలజీలో ఇండియా తిరుగులేని దశకుచేరుతుందన్నారు. కాంగ్రెస్ సారధ్య యుపిఎలో మనకు కాలం చెల్లిన ఫోన్లు, పగిలిన స్క్రీన్‌లు, సరిగ్గా పనిచేయని ఫోన్లు పట్టుకునే గతి ఉండేది. ఎన్ని సార్లు ఎన్ని బటన్లు నొక్కినా ఉలికేవి కావు పలికేవి కావని విమర్శించారు.

ఈ ఫోన్ల మాదిరిగానే అప్పటి ప్రభుత్వం కూడా పూర్తిగా నిరర్థక స్తంభిత పరిస్థితిలో ఉండేదన్నారు. రీస్టార్ట్‌లు, ఎంతగా ఛార్జింగ్‌లు చేసినా, బ్యాటరీలు మార్చినా అవి పనిచేయకుండా ఉండేవన్నారు. ఇది పాత ప్రభుత్వానికి వర్తిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థలు వీరి హయాంలో పనిచేయని మొబైల్స్‌గానే మూల్గుతూ వచ్చాయని, ఇప్పుడు వచ్చిన మార్పు అనూహ్యం అని తెలిపారు. ఇటీవలే గూగుల్ కంపెనీ వారు తమ అత్యాధునిక పిక్సెల్ ఫోన్లకు ఇండియాను ఉత్పత్తికేంద్రంగా ఎంచుకున్నారని వివరించారు. సామ్‌సంగ్ ఇప్పటికే తమ ఫోల్డ్ 5, యాపిల్ తమ ఐఫోన్ 15ను ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. సైబర్ సెక్యూరిటీకి అన్ని చర్యలూ చేపడుతున్నామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News