Monday, April 29, 2024

రూ. కోటి ఇస్తే.. రూ.1.20 కోట్లు ఇస్తామంటూ మోసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజలను నమ్మించి మోసాలు చేస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూ.500 నోట్లు రద్దవుతున్నాయంటూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను షేక్ రోషన్, కొలంపల్లి శ్రీనివాస్, బింగి వాసు, సింగం శెట్టి రాములు గా గుర్తించారు. రూ. కోటి ఇస్తే.. రూ.1.20 కోట్లు ఇస్తామంటూ బురిడీ కొట్టించారు నిందితులు. అనతంతరం ప్రజల దగ్గర సేకరించిన డబ్బుతో ఉడాయించింది. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.09 కోట్లును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News