Saturday, April 27, 2024

‘తానాజీ’ దర్శకుడితో బాలీవుడ్ మూవీ

- Advertisement -
- Advertisement -

 

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డేలు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ కూడా వినిపిస్తోంది. ప్రభాస్ నుంచి వస్తున్న మరో భారీ పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ చిత్రంపై కూడా అంతే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.కానీ ఊహించని విధంగా ఈ సినిమా విషయంలో గత కొన్ని రోజుల నుంచి ఓ సస్పెన్స్ నడుస్తూనే ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో మిగిలి ఉన్న షూటింగ్ టాకీ పార్ట్‌ను ఈ జూలై చివరి వారంలో మొదలు పెట్టనున్నట్లు తెలిసింది.

ఈ చిత్రం కోసం వేసిన స్పెషల్ సెట్స్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నట్టు సమాచారం. తగిన జాగ్రత్తలు తీసుకొని టీం షూటింగ్ మొదలుపెట్టనుంది. ఇదిలాఉండగా ప్రభాస్ ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ప్రభాస్ మూవీ ఉంటుందని.. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీగా నిలిచిన ‘తానాజీ’ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ బాలీవుడ్ మూవీ ఉండనుందట. ‘సాహో’ బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కనుక అక్కడ ప్రభాస్‌కు ఉన్న క్రేజ్‌ను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అక్కడ భారీ బడ్జెట్ తో ఓం రౌత్ దర్శకత్వంలో చారిత్రాత్మక నేపథ్యంలో సినిమాను చేయాలని భావిస్తున్నారట. యువి క్రియేషన్స్ వారు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ హిందీ సినిమాను నిర్మించబోతున్నారట. 2022 చివరలో ఈ చారిత్రాత్మక చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News