Monday, April 29, 2024

 హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం రాత్రి రాష్ట్రపతి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ)కు ఆమె ముఖ్యఅతిథిగా హాదరుకానున్నారు. ఈ మేరకు డిఫెన్స్ విభాగం ఒక ప్రకటనలో వివరాలను తెలిపింది. దుండిగల్‌లోని అకాడమీలో జరగనున్న ఈ పరేడ్‌కు సంబంధించి వివిధ శాఖలకు చెందిన ఫ్లైట్ క్యాడెట్లకు ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ ఇప్పటికే పూర్తైనట్లు ప్రకటించింది. పరేడ్ కార్యక్రమం తర్వాత శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ర్యాంకులు, అవార్డులు అందజేయనున్నారు. ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్‌గార్డు, వైమానిక దళ క్యాడెట్లు, మన దేశంతో స్నేహపూర్వకంగా ఉండే సరిహద్దు దేశాలకు చెందిన క్యాడెట్లకు ‘వింగ్స్’, ‘బ్రెవెట్స్’ను రాష్ట్రపతి ప్రదానం చేస్తారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News